శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 నవంబరు 2020 (09:24 IST)

మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప. 28 కిలోలు.. రూ.4.48లక్షలు

Fish
మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్య్సకారులు అప్పుడప్పుడు అరుదైన చేపలు, ఔషధగుణాలు కలిగిన చేపలు దొరుకుతుంటాయి. అలా దొరికిన వాటికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఇలానే పశ్చిమ బెంగాల్, ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని దీఘా ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన జలేశ్వర్ కు చెందిన ఓ మత్స్యకారుడికి తెలియబేక్టీ అనే పేరుగల చేప దొరికింది. 
 
28 కిలోల బరువైన ఈ చేప పొట్టును ఔషదాల తయారీకి వినియోగిస్తారు. ఈ చేపను వేలం వేయగా కిలో రూ.16 వేలు చొప్పున మొత్తం రూ.4.48 లక్షలకు ఏఎంఆర్ సంస్థ కొనుగోలు చేసింది. మత్స్యకారుడు రబీంద్రబుయ్య మాట్లాడుతూ ఈ చేపను స్థానికంగా తెలియబెక్టి అని పిలుస్తారని, దీని పొట్టు ఔషధాల తయారీలో వినియోగిస్తారని తెలిపారు.