1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 ఆగస్టు 2021 (16:16 IST)

జార్ఖండ్‌లో మైనర్ బాలికపై ఏడుగురు అత్యాచారం

మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఓ బాలికపై ఏడుగురు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్, మందర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న బాలికకు ఓ బాలుడు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకొని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే ఆరుగురు మైనర్లు ఉన్నారు. 
 
బాలికపై వారంతా అఘాయిత్యం చేసిన తర్వాత బైక్‌పై తీసుకొచ్చిన బాలుడే ఆమెను ఇంటి వద్ద దిగబెట్టాడు. నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.