సంబంధిత వార్తలు
- బిల్కిస్ బానోను గ్యాంగ్ రేప్ చేసి, కుటుంబ సభ్యులను చంపిన 11మందిని గుజరాత్ ప్రభుత్వం ఎందుకు విడుదల చేసింది?
- పాఠశాలల ముందు సెల్ఫీల కోసం కుస్తీ పడుతున్న టీచర్స్: వింతగా చూస్తున్న విద్యార్థులు
- 12 గంటలు కష్టపడి డ్యూటీ చేస్తే.. ఇలాంటి ఆహారం పెడతారా?
- Indian Railways jobs 2022..1.4 లక్షల ఉద్యోగాలను భర్తీ
- ఆరోగ్యశ్రీ కిందకు 700 ట్రీట్మెంట్లు.. ఏపీ సర్కారు సిద్ధం
ఎనిమిది యూట్యూబ్ చానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం
భారత్కు వ్యతిరేక కంటెంట్ను ప్రసారం చేస్తున్నందుకుగాను కేంద్ర ప్రభుత్వం ఎనిమిది యూట్యూబ్ చానెళ్ళపై నిషేధం విధించింది. వీటిలో ఏడు చానెళ్లు భారత్కు చెందినవికాగా, మరొకటి పాకిస్థాన్కు చెందిన చానెల్ ఉంది. ఈ చానళ్లు నకిలీ, భారత్ వ్యతిరేక కంటెంట్ను ప్రసారం చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చానెళ్ళపై కేంద్రం ఉక్కుపాదం మోపుతోంది.
తాజాగా బ్లాక్ చేసిన చానెళ్ళ సంఖ్య 102కు చేరింది. ఒక ఫేస్బుక్ అకౌంటెట్తో పాటు ఆ ఫ్లాట్ఫామ్పై రెండు పోస్టులను కూడా కేంద్రం బ్లాక్ చేసినట్టు కేంద్ర టెలికాం, ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ తెలిపింది.
కాగా, ఈ 8 యూట్యూబ్ ఛానళ్లకు మొత్తం 86 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సుమారు 114 కోట్ల మంది ఆ వీడియోలను చూశారని, అయితే ఆ ఛానళ్లు విద్వేషాన్ని రెచ్చగొడుతోందని, మత వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ విభాగం గుర్తించి కేంద్రానికి నివేదించింది.
