1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (16:38 IST)

ఆ కామాంధులను చంపేయండి : పంజాబ్ హైకోర్టు తీర్పు

ఒక సామూహిక అత్యాచారం కేసులో పంజాబ్ - హర్యానా హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ గ్యాంగ్ రేప్ కేసులో ముద్దాయిలుగా తేలిన ఏడుగురికి మరణశిక్షలను విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేనా.. రూ.50 లక్షల అపరాధం చెల్లించాలని, ఈ మొత్తంలో 25 లక్షల రూపాయలను బాధితురాలి చెల్లికి, మరో 25 లక్షలను హర్యానా సర్కారుకు ఇవ్వాలంటూ తీర్పునిచ్చింది. 
 
బుధవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే, గత 2015లో నేపాల్‌కు చెందిన ఓ మహిళపై కొందరు కామాంధులు అత్యంత క్రూరంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం రోహతక్‌లో జరిగింది. మతి స్థిమితం లేని ఆమె, రోహతక్‌లోని సోదరి ఇంటికి వచ్చి కనిపించకుండా పోయింది. మూడు రోజుల అనంతరం దారుణ హింసకు గురైన స్థితిలో తీవ్ర గాయాలతో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. 
 
నిర్భయ తరహాలో గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డారని తేల్చారు. ముఖ్యంగా ఆమె శరీర భాగాల్లో రాళ్లు, కర్రలను కనుగొన్నారు. ఈ ఉదంతంలో 8 మందిపై కేసు నమోదు చేయగా, అదే యేడాది డిసెంబరులో రోహతక్‌ సెషన్స్‌ జడ్జి అందరికీ మరణ శిక్ష విధించారు. వీరిలో ఒకరు మైనర్‌ కూడా ఉన్నారు. తాజాగా కింది కోర్టు తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. అయితే, హత్య కేసులో ముద్దాయిగా తేలిన మైనర్‌కు మాత్రం ఉరిశిక్ష నుంచి మినహాయించింది. 
 
అలాగే, ముద్దాయిలకు భారీ అపరాధం కూడా విధించింది. రూ.50లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇందుకు నేరస్థుల ఆస్తులను విక్రయించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు రోహతక్‌ డిప్యూటీ కమిషనర్‌కు కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. జులై 4వ తేదీనాటికి నేరస్తుల ఆస్తులను గుర్తించి, విక్రయించాలని, అలాగే దీనికి సంబంధించిన సమాచారాన్ని కోర్టుకు అందించాలని కూడా స్పష్టంచేసింది. ఈ మొత్తంలో ఇందులో బాధితురాలి సోదరికి 25 లక్షల రూపాయలు, హర్యానా ప్రభుత్వానికి రూ.25 లక్షలు చెల్లించాలని పేర్కొంది.