గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 22 నవంబరు 2022 (20:00 IST)

పెరిగిపోతున్న ఇండోనేషియా భూకంప మృతులు

earthquake
ఇండోనేషియలోని ప్రధాన ద్వీపం జావా పశ్చిమ భాగంలో సోమవారం సంభవించి భారీ భూకంపం ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఆరంభంలో కేవలం 46 మంది మాత్రమే చనిపోయినట్టు ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. కానీ, ఇపుడు ఈ సంఖ్య 268కి పెరిగింది. సియాంజర్ పట్టణానికి సమీపంలోని 5.6 తీవ్రతతో ప్రకంపనలు రాగా భారీ నష్టం వాటిల్లిన విషయం తెల్సిందే. 
 
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. దీంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోది. ఈ భూకంపం సృష్టించిన విధ్వంసంలో వెయ్యికి మంది వరకు గాయపడ్డారని ఓ అధికారి తెలిపారు. 
 
సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈ భూకంపం వల్ల మరణించిన వారిలో అత్యధికులు చిన్నారులేనని వెల్లడించారు. విద్యార్థులు స్కూల్లో ఉండగా భూకంపం సంభవించడంతో ప్రాణనష్టం అధికంగా జరిగినట్టు భావిస్తున్నారు.