1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2023 (17:41 IST)

జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టి పాస్ మార్కులు వేయాలంటూ విద్యార్థి వేడుకోలు!!

money
ఓ విద్యార్థి పరీక్ష రాశాడు. కానీ, పరీక్ష ఫెయిల్ అవుతానని తెలుసుకున్న ఆ విద్యార్థి జవాబు పత్రాల్లో డబ్బులు పెట్టి.. తనకు పాస్ మార్కులు వేయాలంటూ వేడుకున్నారు. ఈ విషయం బోర్డు పరీక్షా పేపర్ల మూల్యాంకన సమయంలో వెలుగు చూసింది. ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా వెల్లడించారు. ఆన్సర్ షీట్లను తెరిచినపుడు రూ.100, రూ.200, రూ.200 నోట్లు కనిపించడంతో వాటిని దిద్దుతున్న టీచర్ అవాక్కవ్వాల్సి వచ్చిందని తెలిపారు. బుద్ధిగా చదివి మెరుగైన మార్కులు సాధించి ఉత్తీర్ణులు కావాలన్న ఆలోచనకు బదులుగా లంచాలు ఇచ్చి పాస్ అయిపోదామన్న విద్యార్థుల విపరీత ధోరణి ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
దీనిపై ఐపీఎస్ అధికారి బోత్రా స్పందిస్తూ "ఈ ఫోటోను ఓ టీచర్ పంపించాడు. బోర్డు పరీక్షల్లో ఓ విద్యార్థి ఆన్సర్ షీట్ల మధ్య నోట్లను ఉంచినట్టు చెప్పారు. పాస్ మార్కులు వేయాలన్న అభ్యర్థన అక్కడ రాసివుంది. మన విద్యార్థులు, టీచర్లు, మొత్తం విద్యా వ్యవస్థ గురించి ఇది తెలియజేస్తుంది" అని అరుణ్  బోత్రా తన స్పదనను వ్యక్తం చేసారు. ఈ పోస్ట్‌ను చూసిన కొందరు ఇదే తరహా అనుభవం తమకు కూడా ఎదురైందని మరికొందరు టీచర్లు ట్విట్టర్ వేదికగా స్పందిచారు. అడిగిన ప్రశ్నకు సమాధానానికి బదులు ఓ విషాద గాథను రాసి డబ్బులు ఉంచుతుండటం టీచర్లను ఆత్మరక్షణలో పడేస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.