గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మే 2020 (13:39 IST)

కరోనాకు వెండి మాస్కులు - ఒక్కొక్కటి రూ.3 వేలు (video)

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు, కూలీలు, కార్మికులు, పేదలు మధ్యతరగతి ప్రజలు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పూటగడవలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే, ధనవంతులు మాత్రం ఏమాత్రం తమ ఆడంబారులు తగ్గించుకోవడం లేదని పలు సంఘటనలు నిరూపిస్తున్నాయి. 
 
తాజాగా కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు వీలుగు ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌లు ధరించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. దీంతో తమ స్థోమతకు తగిన విధంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తున్నారు. 
 
అయితే, కర్నాటక రాష్ట్రంలోని కోటీశ్వరుల తీరే వేరుగావుంది. మాస్క్‌లు ధరించడం తప్పనిసరైన పరిస్థితుల్లో ధనవంతులు తమ డాబును చూపించడానికి వినూత్న మార్గాన్ని అన్వేషించి పోటీ పడుతున్నారు. వివాహాది శుభకార్యాలకు వచ్చే కొద్దిమందికి కూడా మాస్క్‌లు తప్పనిసరి కావడంతో వెండి మాస్క్‌లను తయారు చేయిస్తున్నారు. 
 
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి, చిక్కోడి తదితర ప్రాంతాల్లో వెండి మాస్క్‌లకు డిమాండ్ అధికంగా ఉంది. వీటి ధర ఒక్కొక్కటీ రూ.2,500 నుంచి రూ.3 వేల వరకూ పలుకుతోందని సమాచారం. అయినప్పటికీ వారు ఏమాత్రం వెనక్కితగ్గకుండా వాటిని కొనుగోలు చేస్తున్నారు.