1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (17:08 IST)

ట్యూషన్‌కు వెళ్లిన బాలుడిపై టీచర్ వేధింపులు.. మద్యం ఇచ్చి..?

ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థిపై చదువు చెప్పాల్సిన ఓ  మహిళా టీచర్ దారుణానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేపింది. కేరళలోని త్రిసూర్ సమీపంలోని మన్నుతి ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఓ బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని చూడటానికి విద్యార్థి సాయంత్రం ట్యూషన్‌కి వెళ్లాడు
 
విద్యార్థిపై కన్నేసిన టీచర్.. మద్యం సేవిస్తూ ఆ బాలుడికి మద్యం ఇచ్చి వేధించాడు. ఆపై చదువుపై ఆ బాలుడు  ధ్యాస పెట్టలేదు. పరీక్షలు కూడా సరిగ్గా రాయలేదు. స్నేహితులతో సరిగ్గా మాట్లాడడం లేదు. 
 
తోటి ఉపాధ్యాయులు కౌన్సెలింగ్‌కు పిలిస్తే ఆ బాలుడు తనకు ఎదురైన అకృత్యాన్ని వెల్లడించలేదు. దీంతో షాక్‌కు గురైన ఉపాధ్యాయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళా టీచర్‌ను పోక్సో చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు.