1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (16:39 IST)

"లంపీ" చర్మవ్యాధి.. 14వేల పశువులు మృతి

Cows
Cows
దేశ వ్యాప్తంగా పశువులు "లంపీ" అనే చర్మవ్యాధి బారినపడి విలవిల్లాడుతున్నాయి. దీని బారినపడి ఒక్క రాజస్థాన్‌లోనే దాదాపు 14వేల పశువులు మృతి చెందాయి. లంపీ వ్యాధి చెలరేగిపోతుండడంతో అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం పశువుల సంతలపై నిషేధం విధించింది. 
 
ఈ నెల పదో తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 14వేల పశువులు ఈ వ్యాధి బారినపడి ప్రాణాలు కోల్పోయాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో లంపీ వ్యాధి తీవ్రంగా ఉన్నప్పటికీ, పరిస్థితి మాత్రం అదుపులోనే ఉందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి పీసీ కిషన్ తెలిపారు. 
 
రాజస్థాన్ తర్వాత గుజరాత్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, అండమాన్ నికోబార్, ఉత్తరాఖండ్‌లలో ఈ వ్యాధి ప్రబలంగా ఉంది. లంపీ చర్మవ్యాధి గోట్‌పాక్స్, షీపాక్స్ కుటుంబానికి చెందినది. కాప్రిపాక్స్ వైరస్ కారణంగా ఇది సోకుతుంది.