మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (14:34 IST)

డెలివరీ బాయ్‌ని చంపేశాడు.. పెట్రోల్ పోసి కాల్చేశాడు.. కారణం?

crime news
కర్ణాటకలోని హాసన్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల యువకుడు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐఫోన్‌కు డబ్బులు చెల్లించమని అడగడంతో డెలివరీ బాయ్‌ని హత్య చేశాడు.. ఓ వ్యక్తి. ఇంకా డెలివరీ బాయ్ శరీరాన్నితగులబెట్టినందుకు ఆయనను అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. హేమంత్ దత్తా అనే నిందితుడు ఫ్లిప్‌కార్ట్ నుండి ఫోన్‌ను ఆర్డర్ చేశాడు. 
 
డెలివరీ తర్వాత రూ. 46,000 చెల్లించాల్సి ఉంది. డెలివరీ బాయ్, హేమంత్ నాయక్, ఫోన్ డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు, దత్తా బాక్స్ తెరవమని అడిగాడు. కానీ నాయక్ నిరాకరించి డబ్బు చెల్లించమని అడిగాడు. నిందితులు నాయక్‌ను కత్తితో పొడిచి చంపి, అతని మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు అతని ఇంట్లో ఉంచి రైల్వే బ్రిడ్జి దగ్గర తగలబెట్టారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో దిగ్భ్రాంతికి గురి చేసింది.
 
స్థానిక అధికారులు ఈ దారుణమైన చర్యను ఖండించారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు గుర్తించారు.