శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 నవంబరు 2022 (19:21 IST)

న్యూఢిల్లీలో ఎగిరే పళ్లెం ఫోటో వైరల్.. అసలు సంగతి ఇదే!

Water Tank
Water Tank
దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ఎగిరే పళ్లెం ఫోటో సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. గ్రహంతరవాసుల సందర్శన గురించిన కథనాలు కూడా విస్తృతంగా ప్రచారం చేయబడ్డాయి. భవనాలపై ఆకాశంలో భారీ సాసర్‌ చిత్రాన్ని ప్రచారం చేశారు. 
 
గ్రహాంతర కథనాలు విస్తృతంగా వ్యాపించడంతో, నిజం ఏమిటో స్పష్టం తెలుసుకోవడం కోసం కొందరు సోషల్ మీడియా ద్వారా లోతైన పరిశోధన చేశారు. అసలు మిస్టరీని చేధించారు. అది ఎగిరే పళ్లెం కాదు, ఢిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యం అని కనిపెట్టారు.
 
వాయుకాలుష్యం కారణంగా ఫ్లయింగ్‌ సాసర్‌ల కనిపించే భారీ తాగునీటి ట్యాంక్‌ చిత్రం. ట్యాంక్‌పై భాగం మాత్రమే కనిపిస్తుంది. వాయు కాలుష్యంతో దిగువ భాగం మరుగున పడింది. దీంతో ట్యాంక్‌ గాలిలో ఎగిరే పళ్లెంలా తయారైందని తేలింది.