సంబంధిత వార్తలు
- శాంతిస్తున్న కరోనా - వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేత.. నైట్ కర్ఫ్యూ మాత్రం...
- భర్తలేడు.. వేరొక వ్యక్తి ఇష్టమన్నాడు.. నో చెప్పడంతో సామూహిక అత్యాచారం..
- బీహార్లో కల్తీ మద్యానికి ఆరుగురు మృతి
- చర్మంపై 21 గంటలు.. ప్లాస్టిక్పై 8 రోజులు - ఇది ఒమిక్రాన్ ఆయుష్షు
- ఆర్ఆర్బీ గోల్మాల్ : విద్యార్థులపై విరిగిన లాఠీ - ఆరుగురు ఖాకీల సస్పెన్షన్
శ్రీనగర్ రాజ్బాగ్ వాణిజ్య భవనంలో మంటలు
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే రాజ్బాగ్లోని కమర్షియల్ కాంప్లెక్స్లో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళ సిబ్బంది హుటాహుటిన ఫైరింజన్లతో వచ్చి మంటలను ఆర్పివేశాయి.
ఈ కాంప్లెక్స్లో సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక అధికారులు అధికారికంగా అంచనా వేశారు. ఈ క్రమంలో మంటలను అదుపు చేస్తుండగా, ఫైర్ ఇంజిన్ అధికారి ఒకరు గాయపడ్డారు. అయితే, ప్రాణనష్టం సంభవించకపోయినప్పటికీ... ఆస్తి నష్టం మాత్రం వాటిల్లింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
