శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 ఏప్రియల్ 2021 (19:32 IST)

ఓ అన్నం మెతుకు.. తొమ్మిది నెలల చిన్నారి ప్రాణం తీసింది..

చిన్నారుల పట్ల కాసింతైనా నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రాణాల మీదకు వస్తుందనేందుకు ఈ ఘటనే సాక్ష్యం. గొంతులో అన్నం మెతుకు ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి చెందాడు. ఈ విషాద ఘటన కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకాలోని రాజవంతి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రాజప్ప, భారతి దంపతులకు తొమ్మిది నెలల కుమారుడు సత్య ఉన్నాడు. 
 
ఆదివారం ఉదయం భారతి వంట చేస్తుండగా... సత్య ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో బాలుడు పక్కనే ఉన్న గిన్నెలోని అన్నం తినేందుకు యత్నించగా...అన్నం మెతుకు గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడక ఏడ్వటం ప్రారంభించాడు. 
 
వెంటనే గుర్తించిన భారతి చిన్నారిని తీసుకుని హుటాహుటిన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లింది. అయితే ఆ సమయంలో చిన్న పిల్లల వైద్యుడు అందుబాటులో లేకపోవడం.. వైద్యం అందించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో బాలుడు మృతి చెందాడు.