1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 22 జులై 2023 (20:49 IST)

పెళ్లిలో అల్లుడికి కట్నంగా 21 విషనాగులు.. ఎక్కడో తెలుసా?

పెళ్ళిలో అల్లుడికి కట్నం బంగారం, నగదుతో పాటు విలువైన వస్తువులను కట్నంగా ఇస్తారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలోని ఒక నిర్దిష్ట సమాజంలో అల్లుడికి విష సర్పాలను కట్నంగా ఇస్తారు.
 
కోర్బా జిల్లా కేంద్రానికి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న ముకుంద్‌పూర్ గ్రామంలోని సంవర తెగకు చెందిన ప్రజలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. 
 
ఈ సంఘంలోని ప్రజలు తమ కుమార్తెల వివాహంలో వరుడికి 21 విష సర్పాలను కట్నంగా ఇస్తారు. ఇది జరగకపోతే వివాహం విచ్ఛిన్నమవుతుందని నమ్ముతుంటారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా సమాజంలో కొనసాగుతోంది. నిజానికి సంవర తెగ ప్రజలు విషపూరిత పాములను పట్టుకునే పని చేస్తారు. 
 
అలాగే ఆ సర్పాలను చూపిస్తూ ప్రజల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ కారణంగా పెళ్లి సమయంలో అల్లుడికి కట్నంగా విష సర్పాలను ఇస్తారు. 
 
ఈ పాములు చాలా విషపూరితమైనవని, అవి ఎవరినైనా కాటేస్తే, ఆ వ్యక్తి వెంటనే చనిపోతాడని చెబుతారు. సకాలంలో పామును పట్టుకోవడంలో అమ్మాయి తండ్రి విఫలమైతే, సంబంధం తెగిపోతుంది.