1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

భారత్‌కు చేరుకున్న ప్రధాని మోడీ - యూపీ సీఎంతో విందు

pmmodi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఒక్క రోజు నేపాల్ పర్యటన ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా లుంబినిలోని మాయాదేవి ఆలయంలో నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్ బాతో కలిసి మోడీ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత మోడీ, దేవ్‌ల సమక్షంలో భారత్, నేపాల్ దేశాల ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఆరు అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, నేపాల్‌కు రాముడికి విడదీయరాని సంబంధం ఉందన్నారు. నేపాల్ లేకుంటే రాముడు అసంపూర్ణం అని వ్యాఖ్యానించారు. అయితే, బుద్ధుడు ఇరు దేశాలను కలుపుతున్నాడని, బుద్ధుడు రాజకీయ సరిహద్దులకు అతీతుడని, బుద్ధుడు ప్రతి ఒక్కరి వాడని చెప్పారు. 
 
ఇదిలావుంటే నేపాల్ పర్యటన ముగించుకున్న ప్రధాని మోడీ లక్నోకు చేరుకున్నారు. అక్కడ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగినాథ్‌తో కలిసి విందులో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ రాష్ట్ర మంత్రులతో రాష్ట్ర పాలనపై చర్చించారు. ఆ తర్వాత యూపీ మంత్రివర్గంతో కలిసి ఆయన గ్రూపు ఫోటో దిగారు. కాగా, యూపీలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఆ రాష్ట్రంలో పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.