1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (12:34 IST)

రాజస్థాన్‌‌లో ఘోర ప్రమాదం.. నలుగురు మహిళల మృతి

రాజస్థాన్‌ రాష్ట్రంలోని బార్మేర్‌ గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. కారు బస్సును ఢీకొనడంతో నలుగురు మహిళలు మృతి చెందారు. వేగంగా వస్తున్న కారు బస్సును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 18 మంది ప్రయాణికులు వెళుతున్న కారు బార్మేర్ గ్రామం వద్ద జాతీయరహదారిపై బస్సును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. 
 
క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. గాయపడిన వారిని జోధ్ పూర్ నగరంలోని ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద స్థలంలోని రోడ్డును పరిశీలించి, ఇంజినీరింగ్ ఢిపెక్టు ఉంటే త్వరలో రోడ్డును మరమ్మతు చేపిస్తామని ఎస్పీ ఆనందశర్మ చెప్పారు. నలుగురు మహిళల మృతదేహాలను పోస్టుమార్టం చేయించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు.