1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 26 నవంబరు 2020 (18:55 IST)

తన శృంగార కోర్కె తీర్చలేదని హత్య చేసి ఆమె మృతదేహంతో ఆ పని చేసాడు

అతనికి శృంగార కోర్కెలు ఎక్కువ. ఇంట్లో పెద్దలు పెళ్ళి చేయడం లేదు. కామకోర్కెలను ఆపుకోలేకపోయాడు. తనకు పరిచయమైన వారితో శారీరక సంబంధం పెట్టుకోవాలనుకున్నాడు. అందుకు ఎవరూ ఒప్పుకోకపోగా అతడిని మందలించారు. అయినా అతనిలో మార్పు రాలేదు. సోదరిగా భావించే మహిళపైనే కన్నేశాడు. ఆమె ప్రతిఘటించడంతో చంపేశాడు. ఆ తరువాత ఆమె మృతదేహంతో శృంగారం చేశాడు. 
 
ఒక సినిమాలో నటుడు ధనరాజ్ శవాలతో శృంగారం చేస్తుంటాడు. అతనే కాదు అతనితో పాటు కొంతమంది స్నేహతులు అదే చేస్తుంటారు. అయితే అది సినిమా. కానీ నిజజీవితంలోను అలాంటి ఘటనే జరిగింది. చిత్తూరుజిల్లా ఎద్దురోల్లపల్లికి చెందిన శంకరప్ప కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి తాలూకా కోనాపుర గ్రామంలో ఉండేవాడు.
 
అక్కడ బంధువులు ఉండటంతో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. తను బతికేందుకే సరిపోని డబ్బుతో బతుకీడుస్తున్న శంకరప్పకు పిల్లనిచ్చేందుకు వారి బంధువులెవరూ ముందు రాలేదు. దీంతో అతడు కామకోర్కెలతో పిచ్చివాడిలా మారాడు. ఎలాగైనా తన కోర్కెలను తీర్చుకోవాలని భావించాడు శంకరప్ప. 
 
దీంతో తనకు బాగా దగ్గర బంధువులైన యువతులు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే తమ బంధువే కావడంతో అందరూ హెచ్చరించి వదిలేశారు. కానీ వరుసకు సోదరి అయిన రాణెమ్మపై కన్నేశాడు శంకరప్ప. ఎలాగైనా ఆమెతో శృంగారం చేయాలనుకున్నాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు.
 
గత నెల 22వ తేదీ ఆమెను పొలంలోనే బలాత్కరించాడు శంకరప్ప. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెను హత్య చేసి పొలంలోనే ఆమె మృతదేహంతో శృంగారం చేశాడు. చనిపోయిన తరువాత పలుమార్లు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆ తరువాత మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులో పడేసి పారిపోయాడు. 
 
పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపితే అసలు విషయం బయటపడింది. నిందితుడి కోసం గాలించారు. కానీ గత నెల రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్న శంకరప్ప బుధవారం పోలీసులకు దొరికాడు.