శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 మే 2021 (08:43 IST)

ముంబై పోలీసులు వేధిస్తున్నారు.. కోర్టుకెక్కిన ఐపీఎస్ అధికారిణి

తనను ముంబై పోలీసు అధికారులు వేదిస్తున్నారంటూ ఓ ఐపీఎస్ అధికారిణి వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఐపీఎస్ అధికారిణి రష్మీ శుక్లా ప్రస్తుతం హైదరాబాద్‌లో సీఆర్‌పీఎఫ్ అదనపు డీజీగా ఉన్నారు. ఈమె మహారాష్ట్ర ఐపీఎస్ అధికారిణి.
 
ఈమె మహారాష్ట్ర నిఘా విభాగాధిపతిగా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ముంబైలో ఆమెపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులు పంపారు. దీనిపైనే ఆమె కోర్టుకెక్కారు. 
 
ప్రస్తుత కరోనా సమయంలో విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ముంబై పోలీసులు వేధిస్తున్నారని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. స్పందించిన న్యాయస్థానం ఆమె పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ముంబై పోలీసులకు నోటీసులు జారీచేసింది. రష్మీ శుక్లా పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది.