శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : బుధవారం, 13 మార్చి 2019 (18:46 IST)

బికనీర్ ల్యాండ్ స్కామ్‌లో ప్రియాంక హస్తం ఉంది: స్మృతీ ఇరానీ

బికనీర్ ల్యాండ్ స్కామ్‌లో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర విమర్శలు చేసారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో స్మృతీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ దేశానికి అవినీతిని గిఫ్ట్‌గా ఇచ్చిందని ఆరోపించింది. గాంధీ కుటుంబం మొత్తం ఏ విధంగా అవినీతికి పాల్పడిందో గడిచిన 24 గంటలుగా న్యూస్ ఛానెల్‌లలో ప్రసారమవుతుందని తెలిపారు. 
 
బికనీర్ ల్యాండ్ స్కామ్ డాక్యుమెంట్స్‌లో ప్రియాంకా గాంధీ పేరు కూడా ఉందని స్మృతీ ఇరానీ బాంబ్ పేల్చింది. ఈ స్కామ్ ఓ ఫ్యామిలీ ప్యాకేజీ అని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రాపై కూడా ఆమె తీవ్రంగా నిప్పులు చెరిగారు. గాంధీ ఫ్యామిలీ సొంత కుటుంబ వ్యక్తుల కోసమే పని చేస్తోందని విమర్శించారు. 
 
ఢిఫెన్స్ డిపార్ట్‌మెంట్ నుండి రాఫెల్ ఫైల్స్ మిస్సింగ్‌లో ఆయుధాల డీలర్ సంజయ్ భండారీ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నట్లు తేలిందని, అంతేకాకుండా రాబర్ట్ వాద్రా, సంజయ్ భండారీలు కలిసి లండన్‌లో బినామీ పేర్లతో ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపారు. దీని వల్ల వాద్రా, భండారీల రహస్య సంబంధం బయటపడిందని అన్నారు.