శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 జులై 2019 (14:45 IST)

భర్త లేచిపోయాడని.. ఇంకో పెళ్లి చేసుకుంటే.. టక్కునొచ్చి నిలబడ్డాడు

అవును.. భర్త వదిలి దేశంపైన పోయాడు. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. అలాంటి సందర్భంలో ఇక భర్త రాడనుకుని.. భార్య రెండో పెళ్లి చేసుకుంది. కానీ ఎక్కడకో వెళ్ళిన భర్త తిరిగివచ్చాడు. వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం అనాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన కట్ట మల్లేష్‌ రెండున్నర దశాబ్దాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 
 
కానీ చివరికి తమిళనాడుకు చేరుకుని.. అక్కడ కూలీగా జీవితాన్ని నెట్టుకువస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకుగాని, భార్యకు గాని తెలియదు. చాలా రోజులు అతని కోసం వెతికారు. ఆచూకీ లేకపోవడంతో చనిపోయి ఉంటాడని నిర్ధారించుకున్నారు. కొన్నాళ్లకు మల్లేష్‌ తల్లిదండ్రులు చనిపోయారు. అతని భార్య కూడా మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. 
 
చాలాకాలం తర్వాత శుక్రవారం గ్రామానికి చేరుకున్నాడు. ఆ ఊరిలో తల్లిదండ్రులు, భార్య ఎవ్వరూ లేరని తెలుసుకుని షాకయ్యాడు. అసలు ఉన్నాడో లేడో అని అనుకున్న వ్యక్తి వున్నట్టుండి కనిపించడంతో గ్రామస్తులు అవాక్కయి.. వారి క్షేమసమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఇంకా భార్య రెండో పెళ్లి చేసుకుందని తెలిసి ఆ వ్యక్తి ఖంగుతిన్నాడు.