చికెన్ మైదా పరోటా...  
                                       
                  
                  				  కావలసిన పదార్థాలు:
	మైదాపిండి - 70 గ్రాములు
	చికెన్ ఖీమా - 150 గ్రాములు
	వెల్లుల్లి తరుగు - 5 గ్రా
				  											
																													
									  
	అల్లం తరుగు - 5 గ్రా
	ధనియాల పొడి - 5 గ్రా
	డేగ్చిమిర్చి - 2 గ్రా
	సాంబార్ మసాలా - 2 గ్రా
				  
	ఉప్పు - 10 గ్రా
	గుడ్డు - 1
	పెచ్దర్ మసాలా - 15 గ్రా
	 
	తయారీ విధానం:
	ముందుకు చికెన్ ఖీమాకు మసాలాలన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు మైదాపిండిని కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆ తరువాత వాటిని చపాతీల్లా చేసి అందులో చికెన్ మిశ్రమాన్ని ఉంచి చుట్టాలి. అంచుల్ని గుడ్డు సొన తడిచేసి మూసేయాలి. చివరగా పాన్ వేడిచేసి చపాతీలను రెండు వైపులా కాల్చాలి. అంతే... చికెన్ మైదా పరోటా రెడీ..