గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By కుమార్ దళవాయి
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (18:43 IST)

భార్యతో ఇండియాలో ఎంజాయ్... ఆ తర్వాత విదేశాల్లో హ్యాపీ... అలాంటి ఎన్ఆర్ఐ భర్తలకు...

ఈమధ్య కాలంలో ఎన్ఆర్ఐ భర్తల మోసాలు ఎక్కువవుతుండటంతో అలాంటి సమస్యలను  పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గంలో చర్యలు తీసుకుంటోంది. భార్యలను వదిలేసి విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసినట్లు కేంద్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలియజేసారు.
 
పెళ్లి చేసుకుని వివిధ కారణాల వల్ల తమ భార్యలను తీసుకెళ్లకపోవడం లేదా వారిని వేధింపులకు గురి చేయడం వంటి సంఘటనలు ఎక్కువ అవుతుండటంతో అటువంటి భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేసే దిశగా విదేశాంగ శాఖ, మహిళా సంక్షేమ శాఖ, హోమ్ శాఖ, న్యాయ శాఖ సంయుక్తంగా ఒక బిల్లును ప్రవేశపెట్టాయి. ఈ బిల్లు ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందింది.
 
కాగా ఇలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు ఇంటిగ్రేటెడ్ నోడల్ ఏజెన్సీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ సంస్థ భార్యలను మోసం చేసి వెళ్లిపోయిన భర్తలపై లుక్ అవుట్ నోటీసు జారీ చేసి, వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేస్తుందని మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటి వరకు ఈ సంస్థ 45 మంది ఎన్ఆర్ఐ భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసినట్లు ఆమె తెలియజేసారు.