1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (16:52 IST)

దేవుళ్లకు అరటి పండును నైవేద్యంగా పెడితే.. ఏం జరుగుతుందో తెలుసా?

అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుందని పురాణాలలో చెబుతున్నారు. అలానే చిన్న అరటి పండును నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ అరటి పండు గుజ్జును దేవునికి న

అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే ఇష్టార్థ సిద్ధి కలుగుతుందని పురాణాలలో చెబుతున్నారు. అలానే చిన్న అరటి పండును నైవేద్యంగా పెడితే ఆగిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. ఈ అరటి పండు గుజ్జును దేవునికి నైవేద్యంగా పెట్టితే అప్పులు బాధలు తొలగిపోయి రావలసిన ధనం చేకూరుతుంది. అంతేకాకుండా శుభకార్యాలకు కావలసిన నగదు త్వరలోనే చేతికందుతుంది.
 
కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే పనులు త్వరగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు సంతోషంగా జరుగుతాయి. పై అధికారుల నుండి ఎటువంటి సమస్యలు రావు. సపోటా పండును నైవేద్యంగా పెళ్ళి కార్యక్రమాలు వేగవంతంగా జరిగిపోతాయి. పెడితే ఎటువంటి సమస్యలైన తొలగిపోతాయి. కమలాపండును నైవేద్యంగా పెడితే మీరు చేయాలనుకున్న కార్యాలు ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతుంది.