దేవాదిదేవుడైన శ్రీకృష్ణభగవానుని చేత స్వయంగా ఉపదేశించబడినట్లుగా భగవద్గీత ఉపదేశములను యధార్థముగా అనుసరించువాడు దివ్యజ్ఞానపు కృపచే సమస్త సందేహాల నుండి విముక్తుడవుతాడు. సంపూర్ణ కృష్ణ చైతన్యములో తనను భగవదంశగా గుర్తించిన వ్యక్తి అదివరకే ఆత్మజ్ఞానములో స్థితుడైనట్లు అర్థము. కనుకనే నిస్సందేహముగా అతడు కర్మబంధాలకు అతీతుడవుతాడు. మానవులు ఇంద్రియభోగాల పట్ల అత్యంత ఆసక్తులై వుంటారు. దుఃఖపూరితమైన ఈ ప్రస్తుత దేహం పూర్వజన్మ కర్మఫలంగా వచ్చినదని తెలుసుకోలేరు. ఈ దేహం తాత్కాలికమైనప్పటికీ...