121 kg gold: 121 కేజీల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు
అజ్ఞాత భక్తుడు తిరుమల శ్రీవారికి భారీ కానుకను అందజేశాడు. తన కంపెనీ షేర్లలో 60 శాతం అమ్మకం ద్వారా 1.5 బిలియన్ డాలర్లు లేదా దాదాపు రూ. 6,000 కోట్ల నుండి రూ. 7,000 కోట్ల వరకు సంపాదించానని.. ఈ కోరికను తీర్చిన శ్రీవారికి అతను మొక్కులు చెల్లించుకున్నాడు. శ్రీ వేంకటేశ్వర స్వామి తనకు ఇచ్చినట్లుగా తిరిగి దేవుడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం మాట్లాడుతూ, వేంకటేశ్వర స్వామి భక్తుడు తన వ్యవస్థాపక విజయానికి కృతజ్ఞతగా దాదాపు రూ.140 కోట్ల విలువైన 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చాడని అన్నారు. ఆ భక్తుడు ఒక కంపెనీని స్థాపించాలని అనుకున్నాడని, దానిని స్థాపించి విజయం సాధించాడని చంద్రబాబు అన్నారు.