1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. Ghee Adulteration Row: Panel Flags Lapses in TTD

Ghee Adulteration Row: శ్రీవారి లడ్డూలో కల్తీ, భారీ లోపాలను ఎత్తిచూపిన ప్యానెల్

Tirumala Laddu
పదవీ విరమణ పొందిన ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్, తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) జరిగిన భారీ లోపాలను ఎత్తిచూపింది. ఈ వ్యవహారంలో మాజీ కార్యనిర్వాహక అధికారి (ఈవో) ఏవీ. ధర్మారెడ్డిని కీలక వ్యక్తిగా కమిషన్ పేర్కొనగా, మాజీ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అలాగే వైకాపా నాయకులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. 
 
తప్పనిసరి పరీక్షలు నిర్వహించకుండా, టెండర్ నిబంధనలను నీరుగార్చి, ప్రయోగశాల నివేదికలను విస్మరించి 70 లక్షల కిలోల నెయ్యిని సేకరించినట్లు ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్ వెల్లడించింది. ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవడం, వారిని బ్లాక్ లిస్టులో చేర్చడం, వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడం వంటి అంశాలు ఇమిడి ఉన్నాయి.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
సూర్యోదయం వేళ జపించాల్సిన మంత్రం ఏమిటి?