1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
  4. yv subba reddy takes oath as ttd chairman

తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతల స్వీకరణ

YV Subba Reddy
తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి వరుసగా రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆయనతో ఈవో జవహర్‌ రెడ్డి బుధవారం ప్రమాణం చేయించారు. శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. 
 
కాగా, తితిదే ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ప్ర‌మాణం చేయ‌డం ఇది రెండోసారి. ఈ కార్యక్ర‌మానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డితో పాటు ప‌లువురు నేత‌లు హాజ‌ర‌య్యారు.
 
ఇకపోతే, తితిదే బోర్డు సభ్యుల నియామకం చేపట్టనున్నారు. వైవీ సుబ్బారెడ్డి తొలిసారి 2019, జూన్‌ 21న టీటీడీ ఛైర్మ‌న్‌గా నియమితులైన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో మొత్తం 37 మంది పాలకమండలి సభ్యులను నియమించారు. జూన్‌ 21వ తేదీ నాటికి వారి ప‌ద‌వీ కాలం ముగియ‌డంతో కొత్త పాల‌క మండలి నియామ‌క ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.  
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
స్వర్ణాకర్ష భైరవుడిని ఎలా పూజించాలి...?