టోక్యో ఒలింపిక్స్ : భారత హాకీ జట్టు ఖాతాలో మరో గెలుపు  
                                       
                  
                  				  టోక్యో ఒలింపిక్స్ పోటీల్లో భారత హాకీ జట్టు ఖాతాలో మరో గెలుపు వచ్చి చేరింది. డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాపై భారత్ విజయం సాధించింది. గ్రూప్-ఏ నాలుగో మ్యాచ్లో 3-1తో విజయం సాధించింది. 
				  											
																													
									  
	 
	ఈ మ్యాచ్ తొలి క్వార్టర్ ముగిసేసరికి 0-0తో ఇరుజట్లు ఖాతా తెరవలేదు. అయితే మ్యాచ్ 43వ నిమిషంలో భారత ఆటగాడు కుమార్ వరుణ్ తొలి గోల్ చేసి జట్టును 1-0తో లీడ్లో నిలిపాడు. అయితే కొద్ది సేపట్లోనే (మ్యాచ్ 48వ నిమిషంలో) అర్జెంటీనా ఆటగాడు మైకో కసెల్లా తన జట్టుకు తొలి గోల్ అందించాడు. 
				  
	 
	ఫలితంగా ఇరుజట్ల స్కోర్ సమమైంది. ఆ తర్వాత మ్యాచ్ 58వ నిమిషంలో ప్రసాద్ వివేక్ సాగర్ రెండో గోల్ చేయడంతో  భారత జట్టుకు ఆధిక్యం లభించింది. ఇక 59వ నిమిషంలో హర్మన్ప్రీత్ సింగ్ మూడో గోల్ చేసి భారత్కు అద్భుత విజయాన్ని అందించాడు. నాలుగో క్వార్టర్లోనే భారత్ రెండు పాయింట్లు సాధించడం విశేషం.