గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 13 జులై 2024 (21:07 IST)

బీఆర్ఎస్‌కి బిగ్ షాక్, మరో వికెట్ డౌన్, కేసీఆర్ 'కారు'ను హస్తం ఫినిష్ చేస్తుందా?

KCR_KTR
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో మరో వికెట్ పడిపోయింది. పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను కలిసారు. మరికొద్దిసేపట్లో ఆయన సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. 
 
మహిపాల్ రెడ్డి చేరికతో భారాస నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారి సంఖ్య 10కి చేరుకుంది. దీనితో సభలో 29 సభ్యులు బలం వున్న భారాస బలం 19కి పడిపోయింది. మరో పది మంది భారాస ఎమ్మెల్యేలను పార్టీ నుంచి లాగేస్తే కారు ఖతం అయిపోతుంది. భారాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకునే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
 
మరోవైపు పార్టీని వీడి వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఏకంగా కేసీఆర్ రంగంలోకి దిగినప్పటికీ ఫలితం కనిపించడంలేదు. ఈ వలసలు ఇలాగే సాగితే తెలంగాణలో కారు కనుమరుగు అయ్యే అవకాశం లేకపోలేదు. మరి ఈ ఉపద్రవాన్ని భారాస అధినేత కేసీఆర్ ఎలా అడ్డుకుంటారో వేచి చూడాల్సిందే.