1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Couple Found Murdered in Patancheru

పటాన్‌చెరు గుడిసెలో దంపతుల హత్య.. ఏం జరిగింది?

crime
నేరాల సంఖ్య రోజు రోజుకీ తెలంగాణలో పెరుగుతున్నాయి. పటాన్‌చెరులోని సిటిజన్స్ కాలనీలో శనివారం ఉదయం ఒక దంపతులు తమ గుడిసెలో హత్యకు గురై కనిపించారు. మృతులను సోమ్లా దశరథ్ (50), ఆయన భార్య మన్యమ్మ (45)గా గుర్తించారు. 
 
వీరు అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భవనాన్ని పర్యవేక్షిస్తూ, జరుగుతున్న పనులను చూసుకునేవారు. ఆ దంపతులు నిద్రిస్తున్న సమయంలో, దుండగులు పదునైన ఆయుధంతో వారి తలలపై బలంగా కొట్టి హత్య చేశారు. 
 
సమాచారం అందుకున్న వెంటనే, పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఆ దంపతులకు తెలిసిన వ్యక్తుల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
భర్తను స్నేహితుడి సాయంతో చంపేసిన భార్య.. నిద్రలో వుండగానే?