1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Bharat Rashtra Samithi Income Increased in 2021-22 Year

భారత్ రాష్ట్ర సమితి ఆదాయం రూ.37 కోట్ల నుంచి రూ.218 కోట్లకు పెరుగుదల

bharat rashtra samithi
ఇటీవల భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆదాయం భారీగా పెరిగిపోయింది. బీఆర్ఎస్ ఆదాయం గత 2021-22 సంవత్సరంలో కేవలం 37.65 కోట్ల రూపాయలుగా ఉంటే ఇపుడు అది ఏకంగా రూ.218.11 కోట్లకు పెరిగింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన 2022 ఆడిట్ రిపోర్టులో పేర్కొది. 
 
ఈ నివేదిక ప్రకారం ఈ యేడాది ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.153 కోట్ల ఆదాయాన్ని తెరాస సేకరించింది. అలాగే, ట్రస్టుల ద్వారా రూ.40 కోట్ల ఆదాయం వచ్చినట్టు ఆ నివేదికలో పేర్కొంది. పార్టీ మొత్తం ఆస్తుల విలువ యేడాదిలో రూ.288 కోట్ల నుంచి రూ.480 కోట్లకు చేరింది.
 
బ్యాంకులు, పోస్టాఫీసుల్లో12 నెలలకు మించి కాలపరిమితితో కూడిన డిపాజిట్ల రూపంలో ఆ పార్టీకి 2022 మార్చి 31వ తేదీ నాటికి రూ.451 కోట్లు దాచింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇలాంటి డిపాజిట్లు రూ.256 కోట్లుగా ఉన్న విషయం తెల్సిందే. 
About Writer
వరుణ్
తర్వాతి కథనం
అగ్రరాజ్యంలో దారుణ పరిస్థితులు.. పెరుగుతున్న మృతులు.. 15 వేల ఫ్లైట్స్ రద్దు