సంబంధిత వార్తలు
- బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కెయూరాకు లయన్ కిరణ్ లక్ష రూపాయల ప్రోత్సాహం
- బాలకృష్ణ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా : ఇక్బాల్
- బస్తీమే సవాల్ : నా గురించి మాట్లాడే అర్హత హరీష్కు లేదు.. ఈటల
- బస్తీమే సవాల్.. దమ్ముంటే రాజీనామా చెయ్... కాకానికి సోమిరెడ్డి ఛాలెంజ్
- తిరుపతి బస్తీమే సవాల్.. తెదేపా గెలిస్తే వైకాపా ఎంపీలంతా రాజీనామా : పెద్దిరెడ్డి ఓపెన్ ఛాలెంజ్
తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బీజేపీ ఎంపీ అరవింద్ ఓపెన్ ఛాలెంజ్
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస, విపక్ష బీజేపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళు హెచ్చుమీరిపోతున్నాయి. నిజామాబాద్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కారుపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడితో ఈ రెండు పార్టీల మధ్య ఒక్కసారిగా వేడిరాజుకుంది. ఇటు బీజేపీ, అటు తెరాస నాయకుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చెలరేగింది. కర్రలు, బండలతో పరస్పరం దాడులకు చేసుకున్నారు. ఈ దాడిలో ఎంపీ అరవింద్ కారు పూర్తగా ధ్వంసమైంది.
ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెరాస పార్టీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో చిత్తుగా ఓడిస్తానని జీవన్ రెడ్డికి సవాల్ విసిరారు. అంతేకాకుండా, ఈ దఫా కేసీఆర్ నుంచి టిక్కెట్ తెచ్చుకో చూద్ధాం అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.
తర్వాతి కథనం