1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. BJP MP Darmapuri Arvind open challenge to Armur MLA Jeevan Reddy

తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బీజేపీ ఎంపీ అరవింద్ ఓపెన్ ఛాలెంజ్

BJP MP Darmapuri Arvind
తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస, విపక్ష బీజేపీ నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ళు  హెచ్చుమీరిపోతున్నాయి. నిజామాబాద్‌‍లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ కారుపై తెరాస కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడితో ఈ రెండు పార్టీల మధ్య ఒక్కసారిగా వేడిరాజుకుంది. ఇటు బీజేపీ, అటు తెరాస నాయకుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చెలరేగింది. కర్రలు, బండలతో పరస్పరం దాడులకు చేసుకున్నారు. ఈ దాడిలో ఎంపీ అరవింద్ కారు పూర్తగా ధ్వంసమైంది. 
 
ఆర్మూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెరాస పార్టీ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 50 వేల మెజార్టీతో చిత్తుగా ఓడిస్తానని జీవన్ రెడ్డికి సవాల్ విసిరారు. అంతేకాకుండా, ఈ దఫా కేసీఆర్ నుంచి టిక్కెట్ తెచ్చుకో చూద్ధాం అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఆంధ్రప్రదేశ్ ను అరాచకాంధ్రప్రదేశ్ గా మార్చేశారు...