1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

సెంట్రల్ బ్యాంకులో చోరీ చేసిన భార్యాభర్తలు

హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో ఉన్న సెంట్రల్ బ్యాంకులో ఇద్దరు భార్యాభర్తలు చోరీకి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూంను తెరిచేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత బ్యాంకులో ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు బ్యాంకులో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గచ్చిబౌలిలో సెంట్రల్ బ్యాంకుకు చెందిన ఓ బ్రాంచ్ వుంది. ఇందులో చోరీ చేయడానికి భార్యాభర్తలు వచ్చారు. ముందుకు బ్యాంకులోకి ప్రవేశించేందుకు కొన్ని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేశారు. ఆ తర్వాత బ్యాంకులోకి ప్రవేశించి, స్ట్రాంగ్ రూం తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ, అది సాధ్యపడలేదు. దీంతో కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను ఎత్తుకుని వెళ్లారు. ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వ్యవహారంపై బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చోరీకి పాల్పడిన దంపతుల కోసం గాలిస్తున్నారు.