1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 1 నవంబరు 2022 (15:53 IST)

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 కోసం సిద్ధమైన హైదరాబాద్‌, నవంబర్‌ 15 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే 25% డిస్కౌంట్

image
ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు రన్నర్లకు జీవితకాలపు అనుభవాలను అందిస్తూ మూడవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023 నిర్వహణ కోసం సిద్ధమైంది. ఈ రన్‌ను 29 జనవరి 2022వ తేదీన నిర్వహించబోతుంది. ఈ రన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ఇప్పుడు తెరుచుకున్నాయి. నవంబర్‌ 15, 2022వ తేదీ లోపుగా రన్‌ కోసం నమోదు చేసుకునే వారికి 25% వరకూ ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ను సైతం అందించనున్నారు. తద్వరా 5కె రన్‌ కోసం 699 రూపాయలు, 10 కిలోమీటర్ల పరుగుకు 1199 రూపాయలు, 21 కిలోమీటర్ల రన్‌కు 1499 రూపాయలు (జీఎస్‌టీతో కలిపి) చెల్లిస్తే సరిపోతుంది.

 
ఈ మారథాన్‌ ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ వద్ద ప్రారంభమవుతుంది. ఈ రన్‌ హైదరాబాద్‌లో అత్యంత అందమైన ల్యాండ్‌మార్క్‌ అయిన దుర్గం చెరువు బ్రిడ్జ్‌పై సాగుతుంది. ఈ రన్‌లో పాల్గొనేవారు తమ బిబ్స్‌పై పేర్లను సైతం తాము కోరుకున్నట్లుగా పొందవచ్చు. ఈ రన్‌లో నమోదు చేసుకున్న వారందరూ 1500 రూపాయల ఖచ్చితమైన బహుమతితో పాటుగా టీ షర్ట్‌, గుడీస్‌ బ్యాగ్‌ను సైతం పొందవచ్చు.

 
ఈ మారథాన్‌ను ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఎన్‌ఈబీ స్పోర్ట్స్‌ నిర్వహిస్తుంది. చక్కటి ఆరోగ్యం కోసం పరుగు అని ఈ కంపెనీ ప్రచారం చేస్తుంది. సేవా రంగంలో దివ్యాంగులకు  ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటుగా నైపుణ్యాభివృద్ధి అందించే దిశగా ఈ మారథాన్‌ నిర్వహిస్తున్నారు. ఎన్‌జీఓ నిర్మాణ్‌ దీనికి చారిటీ భాగస్వామిగా వ్యవహరిస్తుంది.

 
ఈ సంవత్సర జనవరిలో, ఈ మాల్‌ విజయవంతంగా రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2022ను నిర్వహించింది. ఈ రన్‌లో 3200 మంది వ్యక్తులతో సహా 90 మంది దివ్యాంగులు పాల్గొన్నారు. మొత్తంమ్మీద 30 లక్షల రూపాయలను దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగావకాశాల కోసం సమీకరించారు. ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌ 2023ను కోవిడ్‌ 19 స్పోర్ట్స్‌ సేఫ్టీ ప్రమాణాలను అనుసరిస్తూ నిర్వహిస్తారు.