సంబంధిత వార్తలు
- షారూఖ్ ఖాన్ బంగ్లాను పేల్చేస్తానన్నాడు.. అరెస్టయ్యాడు...
- రేణు దేశాయ్, అకీరాకు కరోనా: వ్యాక్సిన్ వేయించుకునే లోపే..?
- ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పక్షవాతం వచ్చింది, వదిలేసి వెళ్లిపోయింది
- ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన శారదా పీఠం స్వాత్మానందేంద్ర
- రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవచ్చు? అందుకోసం ఏం చేయాలి?
నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
నల్గొండలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళితే.. దామరచర్ల మండలంకు చెందిన అన్నాచెల్లెళ్లు ధనావత్ అంజి(20), ధనావత్ అంజలి(17), వారి మేనల్లుడు రమావత్ నవదీప్(8) బైక్పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.
బొత్తలపాలెం వద్దకు రాగానే ముందు ఉన్న ట్రాక్టర్ని బైక్ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ పూర్తిగా ధ్వంసమైంది. మనవడితో సహా ఇద్దరు బిడ్డలు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.