నల్గొండలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళితే.. దామరచర్ల మండలంకు చెందిన అన్నాచెల్లెళ్లు ధనావత్ అంజి(20), ధనావత్ అంజలి(17), వారి మేనల్లుడు రమావత్ నవదీప్(8) బైక్పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బొత్తలపాలెం వద్దకు రాగానే ముందు ఉన్న ట్రాక్టర్ని బైక్ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో...