బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (09:35 IST)

మత్తు మందిచ్చి ముంచేశారు... పెళ్లిలో వధువు నగల బ్యాగ్ చోరీ!

తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బార్దిపూర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో చోరులు తన చేతివాటాన్ని ప్రదర్శించారు. వధువు నగల బ్యాగుతో ఉన్న మహిళకు మత్తు మందు ఇచ్చి, మాటల్లో దించి ముంచేశారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత నగల బ్యాగుతో ఉడాయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, డిచ్‌పల్లి మండలం బార్డిపూర్ శివారులోని ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఓ వివాహం జరిగింది. వివాహానికి బంధువులు తెచ్చిన బంగారం, గిఫ్టులు భారీగానే వచ్చాయి. ఇందులో విలువైన ఆభరణాలను మాత్రం ఓ మహిళ తన బ్యాగులో భద్రపరిచింది. ఈ విషయాన్ని గ్రహించిన చోరులు.. ఆమెకు మత్తు ఇంజిక్షన్ ఆమె వద్ద ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. 
 
మత్తునుంచి తేరుకున్న మహిళా.. విషయాన్ని బంధువులకు చెప్పండంతో ఫంక్షన్ హాల్ మొత్తం వెతికినా ఎక్కడా దొరకలేదు. వెంటనే సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఇద్దరు యువకులు బ్యాగ్ ఎత్తుకెళ్లినట్టు తేలింది. బ్యాగ్‌లో 35 తులాల బంగారు ఆభరాణాలు ఉన్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.