సంబంధిత వార్తలు
- డిసెంబరులో తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సెషన్స్
- మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 కోట్ల నగదు స్వాధీనం : ఐటీ అధికారులు
- గుత్తికోయలు దాడిలో ఫారెస్ట్ రేంజర్ మృతి.. రూ.50 లక్షల పరిహారం
- తెలంగాణాలోని మియాపూర్ వద్ద తమ అత్యాధునిక డీలర్షిప్ ప్రారంభించిన ఐషర్
- మంత్రి శ్రీనివాస్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి కుమారుడు ఆత్మహత్య
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు
ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఏదో ఒక వివాదం చెలరేగుతూనే వుంది. ఫలితంగా నిత్యం వార్తలకెక్కుతుంది. మొన్నటికిమొన్న అక్కడ విద్యాభ్యాసం చేసే విద్యార్థులు చేసిన మెరుపు ఆందోళన రాష్ట్రంలో సంచలనమయ్యాయి. ఇపుడు మరో సంఘటన జరిగింది. ఇక్కడ చదువుకునే ఓ విద్యార్థినిని కొందరు లైంగికంగా వేధించారు.
దీనిపై బాధిత విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. వారి మొబైల్ ఫోన్లు సీజ్ చేయడమేకాకుండా, విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ లైంగిక వేధింపుల వార్త ఇపుడు బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేపుతున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.