1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 28 నవంబరు 2019 (19:25 IST)

శంషాబాద్ విమానాశ్రయం సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన అడవి పిల్లి

అడవిపిల్లిని చూసి చిరుతపులిగా భావించారు శంషాబాద్ విమానాశ్రయ సిబ్బంది. దీనితో ఉరుకులు పరుగులు తీశారు. ఫారెస్ట్ మరియు జూ సిబ్బంది  రంగంలోకి దిగారు. మూడు గంటలు పాటు శ్రమించి దానిని బంధించారు ఫారెస్ట్ అధికారులు. 
 
ఐతే అది చిరుత పులి కాదనీ, అడవి పిల్లిగా ఫారెస్ట్ సిబ్బంది తేల్చడంతో ఊపిరి పీల్చుకున్నారు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది. ఎయిర్ పోర్ట్ లోని ఏరో టవర్స్ వద్ద జరిగింది ఇది.