1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 అక్టోబరు 2021 (11:01 IST)

భర్త - అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య

ప్రేమించి పెళ్లి చేసుకున్న పచ్చటి సంసారంలో చిచ్చురేగింది. దీంతో అత్తారింటిపై అలిగిన కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనసు మార్చుకుని తిరిగి అత్తారింటికి వచ్చింది. కానీ, ఏం జరిగిందో ఏమోగానీ, భర్త, అత్తమామలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో జరిగింది. 
 
స్థానికంగా స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, కేపీహెచ్‌బీ ఆరో ఫేజ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన యువతిని కరీంనగర్‌కు చెందిన వ్యాపారి సాయికృష్ణ (29) ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 
 
అయితే, ఏడాది తర్వాతి నుంచే వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. సాయికృష్ణ తరచూ భార్యను వేధించేవాడు. అతడి వేధింపులు భరించలేని ఆమె 2019లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. 
 
ఈ క్రమంలో ఈ నెల 9న రాత్రి 9 గంటల సమయంలో అత్తింటికి వచ్చిన సాయికృష్ణ చేతిలో సీసా ఉండడంతో దానిని యాసిడ్ అనుకుని భయపడిన భార్య తన గదిలోకి వెళ్లిపోయింది. దీంతో అక్కడే ఉన్న మామతో వాగ్వివాదానికి దిగాడు.
 
అనంతరం సీసాలోని పెట్రోలును ఆయనపై పోసి అగ్గిపుల్ల గీసి అంటించాడు. దీంతో ఆయనకు స్వల్పంగా గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన ఆయన భార్య రమాదేవి కూడా స్పల్పంగా గాయపడ్డారు. 
 
ఆ వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన రమాదేవి, సాగర్‌రావును పోలీసులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
 
కాగా, ఈ ఘటనలో నిందితుడు సాయికృష్ణకు కూడా గాయాలయ్యాయని, స్నేహితుడితో కలిసి కరీంనగర్ వెళ్లి అక్కడ చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.