సంబంధిత వార్తలు
- హైదరాబాద్, తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన మ్యూజిక్ స్కూల్ డైరెక్టర్ పాపారావు బియ్యాల
- ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాలకు ఎల్జీ కట్టుబడివుండాల్సిందే : సుప్రీంకోర్టు
- 2024 సార్వత్రిక సమరానికి సిద్ధమవుతున్న ఎన్నికల సంఘం
- ఫెయిలయ్యామని కొందరు.. తక్కువ మార్కులు వచ్చాయని ఇంకొందరు... ఆత్మహత్యలు
- తెలంగాణాలో ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు రిలీజ్
జేపీఎస్లకు షాకిచ్చిన తెలంగాణ సర్కారు.. విధుల్లోకి రాకపోతే..?
జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్)లకు తెలంగాణ సర్కారు షాకిచ్చింది. శనివారం విధుల్లోకి చేరకపోతే.. వారి స్థానంలో కొత్తవారిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఉద్యోగాల రెగ్యులరైజ్ కోసం జేపీఎస్లు నిరవధిక సమ్మె చేపట్టారు.
సమ్మె కారణంగా విధుల్లో హాజరు కాని వారిపై తెలంగాణ సర్కారు సీరియస్ అయ్యింది. తద్వారా విధులకు హాజరుకాని వారికి ఉద్యోగాలు ఇక ఉండవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పరోక్షంగా హెచ్చరించారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటల్లోగా విధులకు హాజరైన జేపీఎస్ల జాబితా పంపాలని సీఎస్ శుక్రవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
తర్వాతి కథనం