సంబంధిత వార్తలు
- గవర్నమెంట్ స్కూల్లో చేరితే రూ.5 వేల నగదు.. ఎక్కడ?
- జూలై 1 నుంచి పోస్టాఫీసుల్లోని డిపాజిట్లపై పెరుగుతున్న వడ్డీ.. స్కీమ్స్ సంగతేంటి?
- 23 నుంచి 29 వరకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు - జారీ కానీ హాల్టిక్కెట్లు
- 20-06-2022 సోమవారం రాశిఫలాలు ... శంకరుడిని పూజించినా...
- బాసర ట్రిపుల్ ఐటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలు
తెలంగాణాలో ఆలస్యంకానున్న ఇంటర్ పరీక్షా ఫలితాలు
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వెల్లడిలో జాప్యం కానుంది. నిజానికి ఈ నెల ఆరంభంలోనే ఈ ఫలితాలను వెల్లడిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఇంటర్ బోర్డు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక జూన్ 15వ తేదీన ఈ ఫలితాలను వెల్లడించనున్నారనే వార్తలు వచ్చాయి.
కానీ, ఆ రోజు కూడా గడిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇంటర్ ఫలితాలు ఎపుడు వెల్లడవుతాయన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. కనీసం ఈ నెలాఖరైనా ఈ ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే, తెలంగాణ విద్యా శాఖ అధికారుల వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.
