1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (10:35 IST)

సీఎం కేసీఆర్ - ప్రశాంత్ కిషోర్ భేటీ... క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

revanth reddy
తెలంగాణ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ - ప్రశాంత్ కిషోర్ మంతనాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. టీఆర్ఎస్‌తో తెగతెంపుల కోసమే కేసీఆర్‌ను పీకే కలిశారని చెప్పుకొచ్చారు. ఇకపై ప్రశాంత్‌ కిషోర్‌కు, తెరాసకు ఎలాంటి సంబంధం ఉండదన్నారు. 
 
తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి తనతో ఉమ్మడి ప్రెస్‌మీట్‌ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్‌ చెప్పారు. ఆ రోజు పీకే స్వయంగా తెరాసను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం వింటారన్నారు.
 
పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్ఠానం మాటే ఫైనల్‌ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఇక, పార్టీ నేత రాహుల్ గాంధీ సైతం తెలంగాణలో కాంగ్రెస్ కు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదనే అంశాన్ని తేల్చి చెప్పారని రేవంత్ స్పష్టం చేసారు. మే 6 న బహిరంగ సభ లోనూ రాహుల్ ఇదే విషయాన్ని వెల్లడిస్తారని చెప్పారు.