1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TSPSC Group 1 Notification 2022 Telangana 503

గ్రూప్ 1 పోస్టుల భర్తీకి అనుమతులు.. ఆరు పేపర్లు.. 900 మార్కులు

telangana state
తెలంగాణలో త్వరలో 503 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో.. ఈ ఖాళీల భర్తీకి అనుమతులు ఇస్తూ ఆర్థిక శాఖ జీఓ సైతం విడుదల చేసింది. 
 
గ్రూప్‌-1లో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ రెండు పరీక్షలను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. ఈ పేపర్ కరెక్షన్.. ఫలితాల ప్రకటనలో ఎలాంటి సమస్యలు పెద్దగా ఉండవు. కానీ.. మెయిన్స్‌ వ్యాసరూప ప్రశ్నలు కావడంతో వాటిని ప్రొఫెసర్ల చేత దిద్దించాలని నిర్ణయించారు.
 
గ్రూప్ 1 మెయిన్స్‌లో ఆరు పేపర్లు 900 మార్కులు ఉంటాయి. ప్రొఫెసర్‌లతో కూడిన బృందం ప్యానల్ అభ్యర్థును ఎంపిక చేస్తారు. ఇద్దరు ప్రొఫెసర్లు పేపర్లు కరెక్ట్ చేసిన తర్వాత  సరాసరి మార్కులను అభ్యర్థికి ప్రకటిస్తారు.
తర్వాతి కథనం
దేశంలో కొత్తగా మరో 2541 కరోనా పాజిటివ్ కేసులు