1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Telangana RTC Ugadi offer for Telangana people

తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ ఉగాది ఆఫర్‌

Telangana
తెలంగాణ ప్రజలకు టీఎస్‌ఆర్టీసీ ఉగాది ఆఫర్‌ ప్రకటించింది. ఏప్రిల్‌​ 2న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్లకు పైబడిన సీనియర్‌ సిటిజన్స్ అందరూ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. 
 
ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. కేవలం ఏప్రిల్‌ రెండో తేదీ ఉగాది పండుగ సందర్భంగా మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు. 
 
బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును (65 ఏళ్లు దాటినట్లు ఏదైనా వయసు ధ్రువీకరణ పత్రం) బస్సులోని కండక్టర్‌కు చూపించి ఉచితంగా ప్రయాణం చేయవచ్చని సూచించింది.
 
తర్వాతి కథనం
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం... అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు