1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 7 మే 2023 (13:10 IST)

రంగారెడ్డి జిల్లాలో విషాదం... క్రికెట్ ఆడుతుండగా టెక్కీకి గుండెపోటు - మృతి

manikanta
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి గుండెపోటు వచ్చిది. దీంతో ఆయన తుదిశ్వాస విడిచాడు. రంగారెడ్డి జిల్లా కేసీఆర్ స్టేడియంలో విషాదకర ఘటన జరిగింది. మ్యాచ్ మధ్యలోనే వెన్ను నొప్పి రావడంతో బయటకువచ్చి కారులో పడుకుని విశ్రాంతి తీసుకుంటుండగా తుదిశ్వాస విడిచాడు. మృతుడిని ఏపీలోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంకు చెందిన మణికంఠగా గుర్తించారు.
 
హైదరాబాద్ నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే మణికంఠ హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌ బీలో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈయన తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఈ విషాదకర ఘటన జరిగింది. దీనిపై మృతుని సోదరుడు వెంకటేశ్ స్పందిస్తూ, శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్ స్టేడియంలో మ్యాచ్ ఉందని వెళ్లాడని, మధ్యాహ్నం సోదరుడి స్నేహితుడు యశ్వంత్ తనకు ఫోన్ చేసి మణికంఠ చనిపోయాడని చెప్పాడన్నాడు. 
 
క్రికెట్ ఆడుతుండగా, వెన్నునొప్పి వచ్చిందని చెప్పి కారులో వెళ్లి పడుకున్నాడని, మ్యాచ్ అయిపోయిన తర్వాత పిలిచినా పలకకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లామని చెప్పాడు. అయితే, అప్పటికే మణికంఠ మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. వెంకటేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మణికంఠ మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ఆస్పత్రికి తరలించారు.