సంబంధిత వార్తలు
- పరీక్ష రాస్తుండగా విద్యార్థిని గుండెపోటు.. సీపీఆర్ ప్రాణాలు నిలబెట్టిన సిబ్బంది
- ఇకపై గర్భనిరోధక మాత్రలు అక్కర్లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగం...
- ఆర్టీసీ కార్గో సిబ్బంది చేతివాటం : 51 కేజీల జామకాయలకు గాను... 21 కేజీలే చేరాయి..
- టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో స్టేటస్ రిపోర్టు ఇవ్వండి... తెలంగాణ హైకోర్టు
- ప్రశ్నపత్రం లీకేజీకి పాల్పడితే పదేళ్ల జైలు.. ఎక్కడ?
బెడిసికొట్టిన అక్రమ సంబంధం.. విద్యార్థి ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో అక్రమ సంబంధం బెడిసికొట్టింది. దీంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జిల్లాలోని కుకునూరు పల్లి మండలం మంగోల్కు చెందిన లగిశెట్టి అభిషేక్ (19) అనే విద్యార్థి డిగ్రీ చదువుతున్నాడు. ఈ విద్యార్థి హైదరాబాద్ సుచిత్ర ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్లో కూడా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉంటున్న ఓ వివాహితతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఈ క్రమంలో ఆ మహిళ గత కొన్ని రోజులుగా మరో వ్యక్తితో చనవుగా ఉండటాన్ని గమనించిన అభిషేక్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన తన సొంతూరుకు వెళ్లిన అభిషేక్.. మంగోల్లోని పొలం వద్ద పురుగుల మందు సేవించాడు. దీన్ని గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
