పురపాలక ఎన్నికల్లో తెరాస విజయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా తెరాసకే సానుకూలంగా ఉందని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు..పురపాలక ఇన్ఛార్జ్లతో జరిగిన సమావేశంలో వివరించారు. పురపాలక ఎన్నికలకు సంబంధించిన ఏ, బీ ఫారాలను ఎమ్మెల్యేలకు కేసీఆర్ పంపిణీ చేశారు. పురపాలికలు, నగరపాలికల్లో తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో టికెట్ల కోసం...