శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (08:09 IST)

నాకసలే కరోనా... ఆస్తి పత్రాలు ఇస్తావా.. ముఖంపై దగ్గమంటావా?

తన మాట వినని ఓ భర్తను భార్య తనదైనశైలిలో దారికితెచ్చుకుంది. గత కొంతకాలంగా తనను వేధిస్తున్న భర్తకు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. నాకసలే కరోనా వైరస్ సోకివుంది. ఆస్తి పత్రాలు ఇస్తావా లేదా ముఖంపై దగ్గమంటావా అంటూ నిలదీసింది. దీంతో భర్త... భార్య చెప్పినట్టు నడుచుకున్నాడు. 
 
ఈ ఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నందగిరిహిల్స్‌లో నివసించే వ్యాపారవేత్త సంజీవరెడ్డి (70) గతంలో ఓ మహిళ (38)ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి 17 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో మహిళ పేరిట ప్రశాసన్‌నగర్‌లో సంజీవరెడ్డి ఇంటిని కొనుగోలు చేశాడు.
 
అయితే, ఆ తర్వాత ఆ మహిళ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని విడిగా ఉంటుంటుండగా, తండ్రి, కుమారులిద్దరూ నందగిరిహిల్స్‌లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాసన్‌నగర్‌లో కొనుగోలు చేసిన ఇంటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని గత నెల 31న తన మాజీ భర్త ఇంటికి వెళ్లింది. 
 
తన పేరిట ఉన్న ఇంటి పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నీ ఇష్టం మరి.. నాకసలే కరోనా సోకింది, మర్యాదగా ఆస్తిపత్రాలు ఇచ్చేస్తే వెళ్లిపోతా. అప్పటికీ ఆయన నిరాకరించాడు. దీంతో మాజీ భర్తను దుర్భాషలాడడమేకాక, తనకు కరోనా సోకిందని, పత్రాలు ఇవ్వకుంటే ముఖంపై దగ్గుతానని బెదిరించింది. సంజీవరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.