సంబంధిత వార్తలు
- మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 62 కొత్త మార్కెట్లలో ఐకియా డోర్స్టెప్ డెలివరీ సేవలు
- బాల రాముడి విగ్రహ తయారీ కృష్ణ శిల కోసం భార్య తాళిని తాకట్టుపెట్టిన కాంట్రాక్టర్!!
- షూటింగు దశలో "దేవర" - వరుస అప్డేట్స్తో పెరుగుతున్న అంచనాలు
- మసీదుల వద్ద శ్రీరాముడికి ప్రార్థనలు.. కర్ణాటకలో వెల్లివిరిసిన మతసామరస్యం
- ఆయన పేరులో రాముడు.. నా పేరులో శివుడు ఉన్నారు..: డికే శివకుమార్
సూర్యతో రొమాన్స్ చేయనున్న జాన్వీ కపూర్
దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్తో కలిసి స్క్రీన్ స్పేస్ను పంచుకుంటోంది. ఈ సినిమా దేవరగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు.
జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతోందని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ తమిళంలో సూర్య కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. ఇందులో కథానాయికగా జాన్వీ కపూర్ని ఎంపిక చేశారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది కాబట్టి జాన్వీని కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ వార్త జాన్వీ అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచింది. ఈ చిత్రంలో ఆమె కథానాయికగా కనిపించనుంది. అదే సమయంలో రంగ్ దే బసంతి వంటి చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దీనికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది మహాభారతం ఆధారంగా పాన్ ఇండియా చిత్రం, ఇది రెండు భాగాలుగా రూపొందించబడుతుంది. ప్రస్తుతం సూర్య కంగువ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు.
