శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By selvi
Last Updated : శనివారం, 17 మార్చి 2018 (10:41 IST)

ఒకే సినిమాలో నిత్యామీనన్, సాయిపల్లవి.. దర్శకుడు ఎవరో తెలుసా?

మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి దిగుమతి అయిన అందాల ముద్దుగుమ్మలు నిత్యామీనన్, సాయిపల్లవి. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వీరిద్దరికీ మంచి క్రేజ

మలయాళ సినీ ఇండస్ట్రీ నుంచి దిగుమతి అయిన అందాల ముద్దుగుమ్మలు నిత్యామీనన్, సాయిపల్లవి. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో వీరిద్దరూ నటిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వీరిద్దరికీ మంచి క్రేజ్ వుంది. నిత్యామీనన్ ఇప్పటికే అగ్రహీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక మలయాళ ప్రేమమ్‌తో అందరినీ ఆకట్టుకుని ఫిదా, ఎంసీఏ వంటి చిత్రాలతో అదుర్స్ అనిపించిన సాయిపల్లవి కూడా నిత్యామీనన్ బాటలో పయనిస్తోంది.
 
గ్లామర్ పాత్రలను పక్కనబెట్టి.. నటనకు ప్రాధాన్యత గల పాత్రల్లో కనిపించేందుకే ఆసక్తి కనబరుస్తోంది. ఇలా నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ కథానాయికలిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శాంతను భాగ్యరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం కోసం నిత్యామీనన్‌, సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. దర్శకుడు మిస్కిన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.